Anand Devarakonda: కొత్త సినిమా ప్రకటించిన ఆనంద్‌ దేవరకొండ

7 Feb, 2022 13:34 IST|Sakshi

దొరసాని సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ. పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. తర్వాత సెలక్టివ్‌గా కథలు ఎంచుకుంటున్న ఆనంద్‌.. తాజాగా తన కొత్త సినిమాను ప్రకటించాడు.

గంగం గణేశా టైటిల్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశాడు. ఈ మూవీకి ఉదయ్‌ శెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. కేదార్‌ సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చైతన్య భరద్వాజ్‌ సంగీతం అందించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తామని, అప్పుడు మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చిత్రబృందం పేర్కొంది.

మరిన్ని వార్తలు