మారుతీ నుంచి అదిరిపోయే న్యూఏజ్ బాలెనో,రూ.10వేల‌కే బుకింగ్స్ ప్రారంభం!

7 Feb, 2022 13:32 IST|Sakshi

కారు కొనుగోలు దారుల‌కు ప్ర‌ముఖ ఆటోమొబైల్ దిగ్గ‌జం మారుతీ సుజుకి ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. కొత్త హ్యాచ్ బ్యాక్‌ న్యూఏజ్ బాలెనో కార్ల బుకింగ్‌ల‌ను ప్రారంభించిన‌ట్లు తెలిపింది. కొత్త హంగుల‌తో మార్కెట్‌కి ప‌రిచ‌య‌మైన ఈ కారును కేవ‌లం రూ.10వేల‌తో బుకింగ్ చేసుకోవ‌చ్చ‌ని సూచించింది. కొనుగోలుదారులు మారుతి సుజుకి  నెక్సా షోరూమ్లో లేదంటే మారుతి సుజుకి నెక్సా వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి బుక్ చేసుకోవ‌చ్చంది.  

ఈ సంద‌ర్భంగా మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ & సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ..ఇప్ప‌టి వ‌ర‌కు 1 మిలియన్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌లు విక్రయించినట్లు తెలిపారు.“క‌స్ట‌మ‌ర్ల అవ‌స‌రాల్ని తీర్చేందుకు డైనమిక్‌గా డిజైన్ చేసిన‌ట్లు చెప్పారు. ఇన్-కార్ టెక్నాలజీ, ఎక్స్‌ప్రెసివ్ డిజైన్, క్లాస్ లీడింగ్ సేఫ్టీ వంటి సౌక‌ర్యాలు ఉన్నాయ‌ని అన్నారు.  

న్యూ ఏజ్ బాలెనో 'ఫస్ట్-ఇన్ సెగ్మెంట్' హెడ్ అప్ డిస్‌ప్లేను కలిగి ఉంది.హెచ్‌యుడితో,డిస్ప్లే స్పీడోమీటర్, క్లైమేట్ కంట్రోల్ నుంచి ఇన్ఫ‌ర్మేష‌న్ ను అందించ‌డంతో పాటు  కొనుగోలు దారుల‌కు అనుగుణంగా ఇంకా మ‌రెన్నో ఫీచ‌ర్లు అందుబాటులో ఉన్నాయ‌ని శ‌శాంక్ శ్రీవాస్త‌వ తెలిపారు.

మరిన్ని వార్తలు