సాక్షి, హైదరాబాద్: 'మా అసోసియేషన్లో వివాదాలకు కారణం ఏంటి అన్న విషయాలపై క్షుణ్ణంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలి. మా ప్రెసిడెంట్ నరేష్పై చేసిన ఆరోపణలకు గాను నటి హేమపై చర్యలు తీసుకోవాలి. మాలోని సభ్యులందరూ కశ్చితంగా రూల్స్ పాటించాలి. ఆగస్టు 29న జనలర్ బాడీ మీటింగ్ ఉంటుంది. ఆరోజునే ఎన్నికల తేదీ ఖరారు చేసే అవకాశం ఉంది. మంచు విష్ణును యునానిమస్గా మా ప్రెసిడెంట్ని చేస్తే బాగుంటుంది' అని మా సభ్యుడు బాబు అభిప్రాయడ్డారు.
మా అసోసియేషన్ ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహించాలని మా మాజీ మెంబర్ హరినాద్ అన్నారు. ఎలక్షన్కు సంబంధించి 110 మంది మా సభ్యుల బృందం కృష్ణం రాజుకు లేఖను ఇవ్వనున్నట్లు తెలిపారు.
మా ఎన్నికలపై చోటుచేసుకుంటున్న పరిణామాలపై జయసుధ,చిరంజీవి,మోహన్ బాబు , కృష్ణం రాజుకు లేఖలు పంపిస్తున్నామని మా సభ్యుడు మనిక్ పేర్కొన్నారు. ఇండియా, పాకిస్తాన్ తరహాలో మా లో గొడవలు జరుగుతున్నాయని, గత 25 ఏళ్ల కాలంలో ఎన్నడూ ఇలాంటి వివాదాలు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బైలాస్లో ఉన్న నిబంధనల ప్రకారం వివాదాలు సృష్టిస్తున్న వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.