స్పై వస్తున్నాడు

18 Jun, 2023 00:49 IST|Sakshi

నిఖిల్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘స్పై’. కె. రాజశేఖర్‌ రెడ్డి కథ అందించి, నిర్మించిన చిత్రం ఇది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు ఎడిటింగ్‌ బాధ్యతలు కూడా నిర్వర్తించారు గ్యారీ బీహెచ్‌. స్వాతంత్య్ర సమరయోధులు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మరణానికి సంబంధించిన అంశాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్‌ పేర్కొంది.

ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ‘‘భారతదేశ అత్యుత్తమమైన రహస్య కథగా ‘స్పై’ మూవీ ఉంటుంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళం,కన్నడ భాషలతో పాటు  ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను జూన్‌ 29న విడుదల చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్‌ వెల్లడించింది. ఐశ్వర్యా మీనన్‌ హీరోయిన్‌గా, ఆర్యన్‌ రాజేష్‌ ఓ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీ చరణ్‌ పాకాల, విశాల్‌ చంద్రశేఖర్‌.

మరిన్ని వార్తలు