అవకాశాలను అందిపుచ్చుకోవాలి | Sakshi
Sakshi News home page

అవకాశాలను అందిపుచ్చుకోవాలి

Published Sun, Jun 18 2023 12:48 AM

అభ్యర్థులకు సూచనలిస్తున్న పీటీసీ ప్రిన్సిపాల్‌ ఆనందబాబు  - Sakshi

విజయనగరం క్రైమ్‌: ఆర్మీలో చేరబోయే అభ్యర్థులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని పీటీసీ ప్రిన్సిపాల్‌ టి.ఆనందబాబు పిలుపునిచ్చారు. అగ్నివీర్‌ పథకంలో భాగంగా ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో ఉత్తీర్ణులైన ఉమ్మడి జిల్లాకు చెందిన 40 మందికి దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించి రాజీవ్‌ క్రీడా మైదానంలో నిర్వహించే ఉచిత రెసిడెన్షియల్‌ శిక్షణా శిబిరాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జిల్లా వేదికగా వచ్చే నెలలో పోలీస్‌ శిక్షణా కళాశాల మైదానంలో నిర్వహించే పరీక్షలకుగానూ ఏర్పాటు చేసిన ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అభ్యర్థులకు ఉద్యోగం పొందేందుకుగానూ కావాల్సిన ప్రత్యేక మెలకువలు, సూచనలు చేసి వారిని ప్రోత్సహించారు. పీటీసీ నుంచి శిక్షణనిచ్చేందుకు ఒక ఆర్‌ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేశారు. అభ్యర్థులందరూ ఆర్మీ కొలువులు సాధించాలని ఆకాంక్షించారు.

Advertisement
Advertisement