మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళ హిట్ ఫిల్మ్ ‘లూసీఫర్’కు తెలుగు రీమేక్ ఇది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అతని పాత్రకు సంబంధించిన షూటింగ్ని కూడా పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరి కలిసి ఓ పాటకు స్టెప్పులేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో స్టార్ డైరక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఓ పాత్ర పోషించబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవియే ట్విటర్ వేదికగా వెల్లడించాడు.‘నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు,వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని,హైదరాబాద్ వచ్చాడు.ఒకటి అరా వేషాలు వేసాడు ఇంతలో కాలం చక్రం తిప్పింది.స్టార్ డైరెక్టర్ అయ్యాడు.కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా..అందుకే ‘గాడ్ ఫాదర్’లో ఓ స్పెషల్ రోల్ చేస్తున్నాడు’అంటూ చిరంజీవి ట్వీట్ చేశాడు. ఈ చిత్రంలో పూరి ఓ జర్నలిస్టు పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. నయనతార, సత్యదేవ్, బ్రహ్మాజీ, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు,వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని,హైదరాబాద్ వచ్చాడు.ఒకటి అరా వేషాలు వేసాడు ఇంతలో కాలం చక్రం తిప్పింది.స్టార్ డైరెక్టర్ అయ్యాడు.కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా..అందుకే
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 9, 2022
introducing my @purijagan in a special role,from the sets of #Godfather pic.twitter.com/8NuNuoY33j