ప్రేమలోని ఓ సరికొత్త కోణాన్ని ఆవిష్కరించే చిత్రమే ‘బ్రహ్మ రాసిన కథ’

15 Nov, 2021 19:18 IST|Sakshi

నిర్మాత సింధు నాయుడు

లారెన్స్ నరేష్-శ్రీలయ జంటగా నవీన్‌ సంకు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘బ్రహ్మ రాసిన కథ’. ఓ రేంజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో డైనమిక్ లేడి సింధు నాయుడు నిర్మిస్తున్న తొలి చిత్రమిది. సాక్షాత్తూ సరస్వతీదేవి సిఫార్సుతో బ్రహ్మదేవుడి నుంచి ఓ వినూత్నమైన వరం పొందిన ఓ యువకుడి ప్రేమకథలో చోటుచేసుకునే చిత్రవిచిత్రమైన ట్విస్టుల సమాహారంగా ‘బ్రహ్మ రాసిన కథ’ను తెరకెక్కించామని, ప్రేమలోని ఓ సరికొత్త కోణాన్ని ఈ మూవీ ఆవిష్కరిస్తుందని నిర్మాత సింధు నాయుడు తెలిపారు.

నవీన్‌ సంకు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడని, దర్శకుడిగా అతనికి ఉజ్వల భవిష్యత్ ఉందని సింధు నాయుడు పేర్కొన్నారు. హీరోహీరోయిన్లు లారెన్స్ నరేష్-శ్రీలయలకు కూడా చాలా మంచి పేరు వస్తుందని, ఇద్దరూ పోటాపోటీగా నటించారని ఆమె అన్నారు. వంశీ, కల్యాణి, భార్గవ్ నాయక్, రితిక దేశ్ ముఖ్, లక్షిత, సుధీర్ కె.వంశీ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: సన్నీ సకురు; ఎడిటింగ్ & డిఐ: జగ సి.హెచ్.

మరిన్ని వార్తలు