‘ప్రజాపాలన’పై దిశానిర్దేశం

25 Dec, 2023 01:32 IST|Sakshi

తెలంగాణ సచివాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన’ కార్యక్రమం నిర్వహణ సమావేశంలో ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ములుగు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఎస్పీ గాష్‌ ఆలం, అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీజ పాల్గొన్నారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఈనెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ఉదయం, సాయంత్రం సమావేశాలు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. ఇందులో ప్రభుత్వం తరఫున చేపట్టనున్న కార్యక్రమాల గురించి వివరించాలని ఆదేశించారు. – ములుగు

>
మరిన్ని వార్తలు