Sakshi News home page

రామస్వామి ఆశయాలను కొనసాగించాలి

Published Mon, Dec 25 2023 1:32 AM

నివాళులర్పిస్తున్న నాయకులు  - Sakshi

చిట్యాల: సమానత్వం కోసం నిరంతరం కృషిచేసిన మహనీయుడు పెరియార్‌ రామస్వామి ఆశయాలను కొనసాగించాలని అంబేడ్కర్‌ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పుల్ల మల్లయ్య అన్నారు. పెరియార్‌ రామస్వామి 44వ వర్ధంతి కార్యక్రమం మండలకేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పుల్ల మల్లయ్య మాట్లాడుతూ పూర్వకాలంలో అంటరానితనం, కులవివక్ష ఎక్కువగా ఉండేదని అన్నారు. సమాజంలో ప్రజల పట్ల ఉన్న కుల వివక్ష, అంటరానితనం రూపుమాపేందుకు ఎంతో కృషి చేశాడని అన్నారు. మహిళలు చదువుకోవాలని ఆందరూ ఉద్యోగాలు చేయాలని తన జీవితాన్నే త్యాగం చేఽశారని తెలిపారు. మహిళల హక్కుల కోసం జైలు జీవితాన్ని గడిపాడని పేర్కొన్నారు. ఆ మహనీయుడి ఆశయాలు, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని కోరారు. రాజేందర్‌, యుగేందర్‌, ప్రతాప్‌, రాజమౌళి, కిరణ్‌ ఉన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement