Sakshi News home page

క్రిస్మస్‌ కానుకల పంపిణీ

Published Mon, Dec 25 2023 1:32 AM

క్రిస్టియన్లకు కిట్లు అందజేస్తున్న అడిషనల్‌ కలెక్టర్‌  - Sakshi

ములుగు: క్రిస్మస్‌ పండుగ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అందించిన క్రిస్మస్‌ కిట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని డీఎల్‌ఆర్‌ గార్డెన్స్‌లో జిల్లా మైనార్టీ శాఖ తరఫున నిర్వహించిన కార్యక్రమానికి అడిషనల్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌ ముఖ్య అతిథిగా హాజరై అర్హులకు కానుకలు అందజేశారు. కేక్‌ కట్‌ చేసి క్రైస్తవ సోదర, సోదరీమణులకు శుభాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అడిషనల్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ.. క్రీస్తు పుట్టిన రోజు త్యాగానికి మారుపేరని, మానవాళి పాపాలను కడిగివేయాలని ఉద్దేశంతో తన రక్తాన్ని చిందించిన గొప్ప త్యాగశీలి అని గుర్తు చేశారు. క్రీస్తు చూపిన సన్మార్గంలో నడుస్తూ త్యాగనిరతితో సమాజానికి మేలు చేయాలని సూచించారు. ఐక్యంగా ఉంటూ సమాజానికి మంచి చేసే కార్యక్రమాలను చేపడదామని పిలుపునిచ్చారు. అనంతరం విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంకటాపురం(ఎం) తహసీల్దార్‌ శివకుమార్‌, జిల్లా మైనార్టీ శాఖ సిబ్బంది రేణుక, ప్రజా ప్రతినిధులు, పాస్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement