34,457 కరోనా కొత్త కేసులు

22 Aug, 2021 06:21 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో శనివారం 34,457 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,23,93,286కు చేరుకుంది. మరోవైపు యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,61,340కు పడిపోయింది. గత 151 రోజుల్లో ఇదే అత్యల్పం కావడం గమనార్హం. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 1.12 శాతం ఉన్నాయి. గత 24 గంటల్లో 375 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,33,964కు చేరుకుంది. శుక్రవారం 17,21,205 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. టెస్టు పాజిటివిటీ రేటు 1.98గా నమోదైంది. దేశంలో నేటికి 50,45,76,158 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,15,97,982కు చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్త రికవరీ రేటు 97.54గా ఉంది. మరణాల శాతం 1.34గా ఉంది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా కొత్త వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కింద 57.61 కోట్ల డోసుల టీకాలు వేశారు.

మరిన్ని వార్తలు