తమిళనాడు-కర్ణాటక బోర్డర్‌లో భారీ పేలుడు.. 10 మంది మృతి

7 Oct, 2023 21:17 IST|Sakshi

సాక్షి, తమిళనాడు: కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది.ఈ ప్రమాదంలో దాదాపు 10 మందికిపైగా మృత్యువాతపడ్డినట్టు తెలుస్తోంది.

వివరాల ప్రకారం.. తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన అత్తిపల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అత్తిపల్లిలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం సాయంత్రం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 10 మంది మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డినట్టు సమాచారం. అయితే, పేలుడు సంభవించిన సమయంలో బాణసంచా తయారీ కేంద్రంలో 30 మంది ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్యల పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇక, పేలుడు సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు