ఏపీ ప్రజలకు ప్రధాని మోదీ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు

1 Nov, 2023 10:01 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశారాయన. 

ఏపీ ప్రజలు చైతన్యవంతులంటూ ట్వీట్‌ చేశారాయన. అంతేకాదు అసాధారణమైన ప్రతిభ, అచంచలమైన సంకల్పం, దృఢమైన పట్టుదల ఇక్కడి ప్రజల సొంతమంటూ ప్రధాని తన సందేశంలో కొనియాడారు. ఏపీ ప్రజల శ్రేయస్సు కోసం, విజయం కోసం నిరంతరం తాను ప్రార్థిస్తానంటూ ప్రధాని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్ర అవతరణ దినోత్సవం.. వైఎస్సార్‌ అవార్డుల ప్రదానం నేడు

మరిన్ని వార్తలు