లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

12 Nov, 2023 01:50 IST|Sakshi

యడ్లపాడు: జిల్లా విద్య శిక్షణ సంస్థ డైట్‌ బోయపాలెంలో రెండు లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌ఎం సుభాని శనివారం తెలిపారు. గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి పి.శైలజ ఆదేశాల ప్రకారం... ఫిజికల్‌ సైన్స్‌, కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌ సబ్జెక్టులు బోధించేందుకు డెప్యూటేషన్‌ విధానంపై పనిచేయుటకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఫిజికల్‌ సైన్స్‌ సబ్జెక్టుకు.. ఎమ్మెస్సీ (ఫిజిక్స్‌/కెమిస్ట్రీ)లో కనీసం 55శాతం మార్కులు, ఎంఈడీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత, అలాగే కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌కు.. ఎమ్మెస్సీ కంప్యూటర్స్‌ లేదా ఎంసీఏలో 55శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. పంచాయతీరాజ్‌, ప్రభుత్వ యాజమాన్య స్కూళ్లలో పనిచేసే వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ క్యాడర్‌లో కనీసం పదేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలన్నారు. హైస్కూల్‌లో పనిచేస్తున్న హెచ్‌ఎంలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జోన్‌–3లో పనిచేసే ఉపాధ్యాయులు ఇందుకు అర్హులుగా పేర్కొన్నారు. నియామకం అయిన వారు కనీసం 1–3 ఏళ్ల మధ్య కాలం పనిచేయాల్సి ఉంటుందని వివరించారు. 2023 జూలై ఒకటి నాటికి దరఖాస్తుదారుని వయస్సు 58 ఏళ్లకు మించరాదన్నారు. జీతభత్యాలు డైట్‌ ద్వారానే ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన వారు ఈనెల 14 నుంచి 19వ తేదీలోగా డైట్‌ కళాశాలలో తమ దరఖాస్తుల్ని సమర్పించుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌ నంబరు 90523 43447కు సంప్రదించాలని కోరారు.

మరిన్ని వార్తలు