విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా‘ఉద్భవ్‌–2కే23’ | Sakshi
Sakshi News home page

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా‘ఉద్భవ్‌–2కే23’

Published Sun, Nov 12 2023 1:48 AM

మాట్లాడుతున్న ఎస్‌.సాయి సునీల్‌ - Sakshi

చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలో జాతీయ స్థాయి మేనేజ్‌మెంట్‌ మీట్‌ ‘ఉద్భవ్‌–2కే 23’ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. కై జెన్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌ లిమిటెడ్‌ సౌత్‌ రిస్క్‌ హెడ్‌ ఎస్‌.సాయి సునీల్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నింటిలోకి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మనదేనని పేర్కొన్నారు. ఆటిట్యూడ్‌ పాజిటివ్‌ బిహేవియర్‌ మేనేజ్‌మెంట్‌ ట్రైనింగ్‌ సొల్యూషన్స్‌ ఫౌండర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ డీవీ రమణమూర్తి మాట్లాడారు. పలు పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, మెమోంటోలు అందజేశారు. టెక్‌ మహింద్ర హెచ్‌ఆర్‌ బీ.అఖిల ఉన్నారు.

Advertisement
Advertisement