బాలురు, బాలికల విభాగాల్లో విశాఖ,
గుంటూరు జట్లు విజేతలు
అరకులోయ టౌన్: ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కంఠబౌంషుగుడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అండర్–14 రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు శనివారంతో ముగిశాయి. బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో విశాఖపట్నం జట్టు, ద్వితీయస్థానంలో చిత్తూరు జట్టు, తృతీయస్థానంలో శ్రీకాకుళం జట్టు నిలిచింది. బాలికల విభాగంలో ప్రథమస్థానంలో గుంటూరు జట్టు , ద్వితీయ స్థానంలో విశాఖపట్నం జట్టు, తృతీయ స్థానంలో పశ్చిమ గోదావరి జట్టు నిలిచాయి. విజేతలకు ఇన్చార్జీ డీఈఓ గిడ్డి అప్పారావు నాయుడు పతకాలు, ధ్రువపత్రాలు, షీల్డులు అందజేశారు. విజేతలకు బహుమతి ప్రదానం కార్యక్రమంలో డెప్యూటీ డీఈఓ చెల్లయ్య, డీఎస్డీవో జగన్ మోహన్రావు, స్కూల్స్ గేమ్స్ జిల్లా సెక్రటరీ సూరిబాబు, నియోజక ఇన్చార్జి సత్యవతి, అసిస్టెంట్ సెక్రటరీ సద్దు, పీడీ, పీఈటీల ఆర్గనైజింగ్ కార్యదర్శి భూపతిరాజు పాల్గొన్నారు.