బీజేపీ జిల్లా అధ్యక్షుల భేటీలో సంజయ్
సాక్షి, హైదరాబాద్: ‘ప్రజల్లో బీజేపీకి ఆదరణ పెరుగుతుండటంతో ఓర్వలేక టీఆర్ఎస్ నేతలు మరిన్ని దాడులకు పాల్పడే అవకాశముంది. భయపెట్టేందుకు కేసులు కూడా నమోదు చేయొచ్చు. ఎవరూ భయపడొద్దు. బీజేపీకి అధికారం ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ వచ్చే అవకాశం లేదనే విషయాన్ని గుర్తుంచుకోండి. అన్నింటికీ సిద్ధంకండి. తెగించి కొట్లాడండి. మీకు అండగా పార్టీ నాయకత్వం ఉంది. ప్రతి కార్యకర్తనూ కాపాడుకుంటాం’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ‘రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్ని కలు ఎప్పుడైనా రావచ్చు. అందుకు తగ్గట్లుగానే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయండి. స్థానిక సమస్యలే ఎజెండాగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆందోళనలను ఉధృతం చేయండి’ అని సూచించారు. ఆదివారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో జరి గిన జిల్లాల అధ్యక్షుల సమావేశంలో సంజయ్ మాట్లాడారు. టీఆర్ఎస్ పాలనలోని లుకలుకలపై ప్రజల్లో చర్చ జరగకుండా దారి మళ్లిం చేందుకు కేసీ ఆర్ ఉద్యోగాల భర్తీ, ధాన్యం కొనుగోలు పేరుతో రోజుకో డ్రామా చేస్తున్నారని ధ్వజమెత్తారు.
బీజేపీపై ప్రజలు సానుకూలం
‘ప్రజలు టీఆర్ఎస్ పాలనపట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. బీజేపీపట్ల సానుకూలంగా ఉన్నారు. ఈ వాతావరణాన్ని పూర్తిస్థాయిలో పార్టీకి అనుకూ లంగా మార్చుకోవాలి’ అని సంజయ్ అన్నారు. ‘ఎమ్మెల్యే టికెట్ ఎవరికివ్వాలనే విషయాన్ని జాతీ య నాయకత్వం చూసుకుంటుంది. గెలిచే చాన్స్ ఉన్న వాళ్లకే టికెట్లు వస్తాయి. టికెట్లు ఆశిస్తున్న నాయకులు అసెంబ్లీ నియోజక వర్గంలో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి’ అని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, దుగ్యాల ప్రదీప్కుమార్, బంగారు శ్రుతితోపాటు మంత్రి శ్రీనివాస్ , వివిధ జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.
14 నుంచి సంజయ్ రెండో విడతపాదయాత్ర
వచ్చే నెల 14 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న రెండోవిడత ప్రజాసంగ్రామ యాత్రకు పార్టీ యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి ప్రారం భించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 25 రోజులపాటు మొత్తం 400 కి.మీ. పాదయాత్ర నిర్వహించను న్నారు. జోగుళాంబ అమ్మవారి ఆలయం వద్ద æపూజ లు నిర్వహించి, ఆలంపూర్ లేదా గద్వాలలో సంగ్రామయాత్ర సభ నిర్వహించాలని భావిస్తు న్నారు. పాదయాత్ర ప్రారంభానికి కేంద్ర హోంమంత్రి అమిత్షాను ఆహ్వానించనున్నారు.