తెలంగాణ కేబినెట్‌ నిర్ణయాలు ఇవే

7 Dec, 2023 20:57 IST|Sakshi

ఎల్లుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశం

మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఎల్లుండి నుంచి అమలు

సాక్షి, హైదరాబాద్‌: ఆరు గ్యారంటీలపై కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఆరు గ్యారంటీలను అమలు ప్రక్రియలో భాగంగా అన్ని అంశాలపై చర్చించామని పేర్కొన్నారు.

రాబోయే ఐదేళ్లలో మార్పు చూపిస్తాం. రేపు 2 గ్యారంటీలకు సంబంధించి ఆయా శాఖలతో సీఎం చర్చిస్తారు. 2014 నుంచి 2023 వరకు ప్రభుత్వ శాఖల ఖర్చుపై చర్చించాం. అన్ని శాఖల ఆదాయ వ్యయాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని నిర్ణయించాం. ఈ నెల 9న రెండు గ్యారెంటీలు అమల్లోకి తెస్తాం’’ అని మంత్రి వెల్లడించారు.

మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఎల్లుండి నుంచి అమలు
►ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షలకు పెంపు
►ఎల్లుండి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
►రైతులకు, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ 

>
మరిన్ని వార్తలు