ఆంజనేయస్వామి గుడిలో చోరీ

11 Nov, 2023 02:02 IST|Sakshi
చోరీ అయిన ఆంజనేయస్వామి ఆలయం

కొండపి(సింగరాయకొండ): కొండపి మండలం చిన్నవెంకన్నపాలెం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఆంజనేయస్వామి గుడిలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. సుమారు లక్ష రూపాయల విలువైన స్వామివారి వెండి తొడుగులు చోరీ అయ్యాయి. ఎస్సై వై.నాగరాజు కథనం ప్రకారం.. చిన్నవెంకన్నపాలెం గ్రామంలో రోడ్డు పక్కన పుండే ఆలయంలో ఇనుప తలుపు గడులను రంపపు బ్లేడ్‌తో కోసి దొంగలు లోపలికి ప్రవేశించారు. స్వామి వారి గద, కొండ, తోకకు ఏర్పాటు చేసిన వెండి తొడుగులతోపాటు వెండి శటారును అపహరించారు. స్వామి వారి వెండి కిరీటాన్ని తీసుకెళ్తూ గుడి సమీపంలో పడేశారు. వీటి బరువు సుమారు ఒకటిన్నర కేజీ ఉంటుంది. ఆలయంలోని చిన్న స్టీలు హుండీని కూడా పగలగొట్టి సుమారు రూ.500 కాజేశారు. గ్రామ నాయకులు రాఘవేంద్రశర్మ, ఆలయ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. క్లూస్‌ టీమ్‌ను రప్పించి వేలిముద్రలు సేకరించారు.

మరిన్ని వార్తలు