అగ్రహారం రైల్వే గేటు వద్ద బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు | Sakshi
Sakshi News home page

అగ్రహారం రైల్వే గేటు వద్ద బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు

Published Sat, Nov 11 2023 2:02 AM

-

ఒంగోలు: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి చొరవతో ఒంగోలు నర్సాపురం అగ్రహారం రైల్వే గేటు వద్ద అండర్‌ బ్రిడ్జి నిర్మాణానికి గతిశక్తి రైల్వే అధికారులు టెండర్లు పిలిచారు. లెవల్‌ క్రాసింగ్‌ 207 వద్ద అండర్‌ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి ప్రాథమిక చర్యలు పూర్తయ్యాయని, అండర్‌ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేయాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇటీవల విజయవాడలోని గతిశక్తి చీఫ్‌ ఇంజినీర్‌, దక్షిణ మధ్య రైల్వే డివిజినల్‌ రైల్వే మేనేజర్‌లను కోరారు. ఈ నేపథ్యంలో విజయవాడ రైల్వే డివిజన్‌ గతిశక్తి అధికారులు స్పందించి అండర్‌ బ్రిడ్జి నిర్మాణానికి రూ.21 కోట్లతో టెండర్‌ పిలిచారు. డిసెంబర్‌ 1వ తేదీ చివరితేదీగా పేర్కొన్నారు. టెండరు ప్రక్రియ పూర్తికాగానే బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని రైల్వే అధికారులు ప్రకటించడంపై ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement