స్పృహతప్పి ఇంటర్మీడియట్‌ విద్యార్థిని తీవ్ర విషాదం!

25 Dec, 2023 09:16 IST|Sakshi

రామచంద్రాపురం: ఇంటర్మీడియట్‌ చదువుతున్న ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన బీహెచ్‌ఈఎల్‌ కాలనీలో శనివా రం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహెచ్‌ఈఎల్‌ కాలనీలో నివాసముండే మదిహాబేగం (19) ఇంటర్మీడియట్‌ చదువుతుంది. శనివారం రాత్రి తన నివాసంలో చదువుకుంటూ స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆమెను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి చ‌ద‌వండి: భార్యాభర్తల మధ్య గొడవ! భ‌ర్త ఒక్క‌సారిగా..

>
మరిన్ని వార్తలు