Deaflympics 2022: షేక్‌ జాఫ్రీన్‌కు కాంస్యం

15 May, 2022 06:42 IST|Sakshi

కాక్సియాల్‌ డు సల్‌ (బ్రెజిల్‌): బధిరుల ఒలింపిక్‌ క్రీడల్లో (టెన్నిస్‌) ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి షేక్‌ జాఫ్రీన్‌ కాంస్య పతకం సాధించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో మూడో స్థానం కోసం జరిగిన పోరులో జాఫ్రీన్‌–పృథ్వీ శేఖర్‌ జోడి 6–1, 6–2తో భారత్‌కే చెందిన భవాని కేడియా – ధనంజయ్‌ దూబే జంటను ఓడించింది.

ఈ జోడీలో భవాని తెలంగాణకు చెందిన ప్లేయర్‌. అంతకు ముందు సెమీ ఫైనల్లో చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన బ్లాస్కికోవా–స్మెడెక్‌ చేతిలో 7–5, 5–7, 2–6తో జాఫ్రీన్‌–పృథ్వీ ఓడగా...వెన్‌ లిన్‌–వీ వాంగ్‌ (చైనీస్‌ తైపీ) 6–0, 6–1తో భవాని–ధనంజయ్‌పై గెలుపొందారు.

మరిన్ని వార్తలు