Asia Cup 2023: పాక్‌పై టీమిండియా గెలుపు

2 Sep, 2023 21:10 IST|Sakshi

ఆసియా కప్‌ 5s హాకీ టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది. చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో ఇవాళ (సెప్టెంబర్‌ 2) జరిగిన ఫైనల్లో భారత్‌ 6-4 గోల్స్‌ తేడాతో గెలుపొందింది. నిర్ణీత సమయంలో భారత్‌, పాక్‌లు చెరి 4 గోల్స్‌ చేయడంతో పెనాల్టీ షూటౌట్స్‌ ద్వారా ఫలితం తేలింది. షూటౌట్స్‌లో భారత్‌ రెండు అటెంప్ట్స్‌ను గోల్స్‌గా మలిచి, ఛాంపియన్‌గా అవతరించింది. 5s ఫార్మాట్‌లో భారత్ పాక్‌ను ఓడించడం మూడు సందర్భాల్లో ఇదే మొదటిసారి.

సెకెండాఫ్‌లో 2-4 గోల్స్‌ తేడాతో వెనుకంజలో ఉండిన భారత్‌.. అనూహ్యంగా పుంజుకుని, షూటౌట్స్‌ వరకు వెళ్లి విజేతగా నిలిచింది. షూటౌట్స్‌లో పాక్‌ రెండు ప్రయత్నాల్లో విఫలం కాగా.. గుర్జోత్‌ సింగ్‌, మణిందర్‌ సింగ్‌లు తలో గోల్‌ చేసి, భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. అంతకుముందు భారత్‌ 2-4 గోల్స్‌తో వెనుకపడి ఉన్నప్పుడు మొహమ్మద్‌ రహీల్‌ 2 గోల్స్‌ చేసి, మ్యాచ్‌ డ్రా అయ్యేందుకు దోహదపడ్డాడు. 

మరిన్ని వార్తలు