IRE vs IND: టీమిండియాతో టీ20 సిరీస్‌.. జట్టును ప్రకటించిన ఐర్లాండ్‌

16 Jun, 2022 12:09 IST|Sakshi

స్వదేశంలో టీమిండియాతో టీ20 సిరీస్‌కు 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఐర్లాండ్‌ గురువారం ప్రకటించింది. ఈ సిరీస్‌లో యువ ఆటగాడు స్టీఫెన్ దోహెనీ, పేస్ బౌలర్ కానర్ ఓల్‌ఫెర్ట్ ఐర్లాండ్‌ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నారు. 23 ఏళ్ల దోహెనీ దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ఏడాది ఇంటర్-ప్రోవిన్షియల్ టీ20 ట్రోఫీలో మెరియన్‌ క్లబ్‌ తరపున నాలుగు మ్యాచ్‌లు ఆడిన దోహెనీ.. 158 పరుగులు సాధించాడు.

ఇక ఓల్‌ఫెర్ట్ బ్రెడీ క్లబ్ తరపున ఆడుతున్నాడు. గత ఏడాది యూఏఈలో పర్యటించన ఐర్లాండ్‌ జట్టుకు నెట్ బౌలర్‌గా ఓల్‌ఫెర్ట్ వ్యవహరించాడు. ఇప్పటివరకు ఇంటర్-ప్రావిన్షియల్ టీ20 ట్రోఫీలో 6 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐర్లాండ్‌ పర్యటనలో భాగంగా టీమిండియా రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇరు జట్లు మధ్య తొలి టీ20 జూన్ 26న మలాహిడ్‌ వేదికగా జరగనుంది. మరోవైపు ఐర్లాండ్‌ పర్యటనకు భారత జట్టును బీసీసీఐ  బుధవారం ప్రకటించింది.

భారత సిరీస్ కోసం ఐర్లాండ్ జట్టు
ఆండ్రూ బల్బిర్నీ (కెప్టెన్), మార్క్ అడైర్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, స్టీఫెన్ డోహెనీ, జోష్ లిటిల్, ఆండ్రూ మెక్‌బ్రైన్, బారీ మెక్‌కార్తీ, కోనార్ ఓల్ఫెర్ట్, పాల్ స్టిర్లింగ్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, క్రైగ్ యంగ్.
 

>
మరిన్ని వార్తలు