IND vs NZ 1st T20 2021: తొలి టీ20 మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌కు బిగ్‌ షాక్‌...

17 Nov, 2021 12:31 IST|Sakshi

Kyle Jamieson pulls out of New Zealand T20I Series against India: టీమిండియాతో తొలి టీ20 మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఫాస్ట్‌ బౌలర్‌ కైల్‌  జేమీసన్ భారత్‌తో టీ20 సిరీస్‌ నుంచి వైదొలిగాడు. భారత్‌తో జరగనున్న టెస్ట్‌ సిరీస్‌పై దృష్టి సారించేందకు అతడికి విశ్రాంతి ఇచ్చినట్లు ఆ జట్టు హెడ్‌ కోచ్‌ గ్యారీ స్టెడ్‌ తెలిపాడు.

కాగా గాయం కారణంగా కెప్టెన్‌ విలియమ్సన్‌ జట్టు నుంచి తప్పుకోగా, ఇప్పుడు జేమీసన్ జట్టుకు దూరమయ్యాడు. ఇక విలియమ్సన్‌ జట్టు నుంచి తప్పుకోవడంతో ఆ జట్టు ఫాస్ట్‌ బౌలర్‌ టిమ్‌ సౌథీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కాగా బుధవారం(నవంబర్‌17)న జైపూర్‌ వేదికగా తొలి న్యూజిలాండ్‌- భారత్‌ తొలి టీ20 మ్యాచ్‌ జరగనుంది.

"కేన్‌ విలియమ్సన్‌, కైల్‌ జేమీసన్ తో మాట్లాడాకే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. వారిద్దరూ భారత్‌తో టెస్ట్ మ్యాచ్‌లకు సిద్ధంగా ఉండబోతున్నారు. టెస్ట్‌ సిరీస్‌లో ఆడబోయే మిగతా ఆటగాళ్లు కూడా టీ20 సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడరు. వాళ్ల స్ధానంలో కొత్త ముఖాలకు అవకాశం ఇస్తాం. ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి కావాలి అని స్టెడ్‌ పేర్కొన్నాడు.

చదవండి: IND vs NZ 1st T20 2021: 'ఓపెనర్లుగా రోహిత్‌, రాహుల్‌.. వెంకటేశ్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌కు నో ఛాన్స్‌'

మరిన్ని వార్తలు