T20 WC 2021: ఫైనల్‌కు ముందు రాత్రంతా.. గాయంతో బాధపడినా గానీ..

18 Nov, 2021 12:43 IST|Sakshi

Matthew Wade Spoke About Situation 24 Hours Before Played T20 World Cup 2021 Final With an Injury: టీ20 ప్రపంచకప్‌-2021ను ఆస్ట్రేలియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ జట్టు ఫైనల్‌ చేరడంలో వికెట్‌ కీపర్‌ మాథ్యూ వేడ్‌ కీలక పాత్ర పోషించాడు. కాగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో మాథ్యూ వేడ్‌  గాయంతో బరిలోకి దిగినట్లు తాజాగా వెల్లడైంది. ఈ విషయాన్ని వేడ్‌ స్వయంగా క్రికెట్ ఆస్ట్రేలియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

"ఫైనల్‌కు ముందు రోజు రాత్రి నేను కొంచెం ఆందోళన చెందాను. ఎందకంటే ఆరోజు నేను ప్రక్కటెముకల నొప్పితో బాధపడుతున్నాను. నేను ఆ రాత్రంతా మేల్కొని ఉన్నాను. మ్యాచ్‌ రోజు నాకు కొంత ఊపశమనం లభించడంతో నేను ఆడగలిగాను. ఒక వేళ మ్యాచ్‌ రోజు నా నొప్పి తగ్గకపోయింటే జట్టుకు దూరంగా ఉండేవాడిని, ఎందుకంటే నా వల్ల జట్టకు ఎటువంటి నష్టం జరగకూడదు" అని వేడ్‌ పేర్కొన్నాడు.

ఫైనల్‌కు ముందు మాథ్యూ వేడ్ ఫిట్‌నెస్ గురించి ఆందోళన చెందినట్లు ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా తెలిపాడు. స్కానింగ్ లకు కూడా తీసుకెళ్లినట్లు అతడు చెప్పాడు. కానీ స్కానింగ్‌ రిపోర్ట్‌లను కూడా వేడ్‌ చూడలేదు అని ఫించ్‌ పేర్కొన్నాడు. గాయంతో బాధపడతున్నప్పటకీ టోర్నమెంట్‌లోని అత్యంత కీలకమైన మ్యాచ్‌లో వేడ్ ఆడినందుకు  గర్విస్తున్నానని ఫించ్ తెలిపాడు. అయితే ఈ మ్యాచ్‌లో వేడ్‌కు బ్యాటింగ్‌ చేసే అవకాశం రానప్పటికీ.. వికెట్‌ కీపర్‌గా ఆ జట్టుకు సేవలు అందించాడు.

  చదవండి: వచ్చే ఏడాది ప్రపంచ కప్‌ నుంచి న్యూజిలాండ్‌ ఔట్‌.. కారణం ఏంటంటే!

మరిన్ని వార్తలు