Ravindra Jadeja: సీఎస్‌కే ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు డిలీట్ చేసిన జడేజా.. కారణం అదేనా..?

8 Jul, 2022 18:45 IST|Sakshi

టీమిండియా స్టార్‌ ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌కు సంబంధించిన అన్ని రకాల పోస్టులను తొలిగించాడు. ఇక ఐపీఎల్‌లో గత కొన్నేళ్లుగా సీఎస్‌కేకు జడేజా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఐపీఎల్‌-2022కు ముందు సీఎస్‌కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఎంస్‌ ధోని తప్పుకోవడంతో నూతన సారథిగా జడేజా ఎంపికయ్యాడు. అయితే సారథ్య బాధ్యతల చేపట్టిన జడేజా ఒత్తిడి కారణంగా టోర్నీ మధ్యలోనే.. తిరిగి ధోనికి అప్పగించేశాడు.

అనంతరం గాయం కారణంగా మిగిలిన సీజన్‌కు జడేజా దూరమయ్యాడు. అయితే ఈ ఏడాది సీజన్‌లో జడేజా దారుణంగా విఫలమయ్యాడు. ఇక  వచ్చే ఏడాది సీజన్‌కు ముందు సీఎస్‌కేకు జడ్డూ గుడ్‌బై చెప్పనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో జడేజా సీఎస్‌కే పోస్టులను డిలీట్‌ చేయడం.. ఆ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లైంది. ఇక గాయం నుంచి కోలుకున్న జడేజా తిరిగి ఇంగ్లండ్‌తో టెస్టుకు భారత జట్టులో చేరాడు. ఈ టెస్టులో జడేజా అద్బుతమైన సెంచరీ సాధించాడు. జడేజా ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు భారత జట్టులో భాగంగా ఉన్నాడు. ఆదే విధంగా త్వరలో జరగనున్న వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు వైస్‌ కెప్టెన్‌గా జడేజా ఎంపికయ్యాడు.
చదవండి: IND vs ENG: 'ఇదేం నాకు ప్రత్యేకమైన రోజు కాదు.. నా కష్టానికి ప్రతిఫలం దక్కిందంతే'

మరిన్ని వార్తలు