Malaysia Open 2023: సెమీస్‌లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ ఓటమి 

15 Jan, 2023 10:58 IST|Sakshi

కౌలాలంపూర్‌: మలేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ విభాగంలో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడీ పోరాటం ముగిసింది.

శనివారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంక్‌ జోడీ సాత్విక్‌–చిరాగ్‌ 16–21, 21–11, 15–21తో ప్రపంచ 17వ ర్యాంక్‌ ద్వయం లియాంగ్‌ వె కెంగ్‌–వాంగ్‌ చాంగ్‌ (చైనా) చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్లో ఓడిన సాత్విక్‌–చిరాగ్‌ జోడీకి 17,500 డాలర్ల (రూ. 14 లక్షల 22 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 8,400 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.    

మరిన్ని వార్తలు