T20 Worldcup 2021: భారత్‌తో తలపడే జట్టును ప్రకటించిన పాక్‌..

23 Oct, 2021 17:17 IST|Sakshi

Pakistan 12 Member Squad for ICC World T20 match against India: టీ20 ప్రపంచకప్‌2021లో క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూసున్న దాయాదుల పోరుకు రంగం సిద్దంమైంది. టీమిండియా, పాకిస్తాన్‌ మధ్య సమరానికి ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో  ఆదివారం భారత్‌తో జరిగే మ్యాచ్‌ కోసం పాకిస్తాన్‌ 12 మంది సభ్యులతో కూడిన జట్టును  ప్రకటించింది. కాగా పాక్‌ ప్రకటించిన జట్టులో షోయబ్ మాలిక్‌కు అనూహ్యంగా చోటు దక్కింది.

మాలిక్‌ స్ధానంలో సర్ఫరాజ్ అహ్మద్‌కు చోటు దక్కుతుందని అంతా భావించినప్పటికీ ఆజట్టు యాజమాన్యం మాత్రం మాలిక్‌ వైపే మొగ్గు చూపింది.  హైదర్‌ ఆలీను రిజర్డ్‌ ప్లేయర్‌గా ఎంపిక చేశారు. భారత్‌ మాత్రం జట్టు ఎంపిక గురించి ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఇప్పటివరకు ప్రపంచకప్‌లో ఒక్క ​మ్యాచ్‌ కూడా భారత్‌పై పాకిస్తాన్‌ విజయం సాధించలేకపోయింది. ఈ సరైన భారత్‌పై  గెలిచి పరువు నిలబెట్టుకోవాలని పాకిస్తాన్‌ భావిస్తోంది.

భారత్‌తో తలపడబోయే పాక్‌ జట్టు:  బాబర్ అజమ్ (కెప్టెన్‌), మొహమ్మద్ రిజ్వాన్ (వికెట్‌ కీపర్‌), ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసఫ్ అలీ, షాదాబ్ ఖాన్, ఇమాద్‌ వసీం, హసన్ అలీ, హారిస్ రౌఫ్, షహీన్ షా అఫ్రిది, హైదర్‌ ఆలీ(రిజ్వర్డ్‌)

చదవండి: T20 World Cup 2021: కోహ్లి సేన బలబలాలు ఏంటి.. ఏ ఆటగాడి రికార్డు ఎలా ఉంది?

>
మరిన్ని వార్తలు