-
పాక్ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా.. 360 పరుగుల తేడాతో ఘన విజయం
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన తొలి టెస్ట్లో ఆతిథ్య ఆస్ట్రేలియా 360 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. నాలుగు రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్లో ఆసీస్ అన్ని విభాగాల్లో ప్రత్యర్ధిపై పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్లో 487 పరుగులకు ఆలౌట్ కాగా.. పాక్ కేవలం 271 పరుగులకే (తొలి ఇన్నింగ్స్లో) పరిమితమైంది. ఆసీస్ ఇన్నింగ్స్లో డేవిడ్ వార్నర్ 164 పరుగులతో చెలరేగిపోగా.. మిచెల్ మార్ష్ 90 పరుగులు చేసి ఔటయ్యాడు. పాక్ అరంగేట్రం బౌలర్ ఆమిర్ జమాల్ 6 వికెట్లు పడగొట్టాడు. పాక్ తొలి ఇన్నింగ్స్లో ఇమామ్ ఉల్ హాక్ (62) టాప్ స్కోరర్గా నిలిచాడు. నాథన్ లియోన్ 3, స్టార్క్, కమిన్స్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. 5 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసి (డిక్లేర్) 450 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్ధి ముందు ఉంచింది. ఉస్మాన్ ఖ్వాజా (90), మిచెల్ మార్ష్ (63 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ 3 వికెట్లు పడగొట్టగా.. షాహీన్ అఫ్రిది, ఆమిర్ జమాల్ తలో వికెట్ దక్కించుకున్నారు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా అటాక్ చేయడంతో 89 పరుగులకే కుప్పకూలి భారీ తేడాతో ఓటమిపాలైంది. స్టార్క్, హాజిల్వుడ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. లియోన్ 2, కమిన్స్ ఓ వికెట్ దక్కించుకున్నారు. పాక్ ఇన్నింగ్స్లో సౌద్ షకీల్ (24), బాబర్ ఆజమ్ (14), ఇమామ్ ఉల్ హాక్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. రెండు ఇన్నింగ్స్ల్లో మెరుపు హాఫ్ సెంచరీలు చేయడంతో పాటు ఓ వికెట్ కూడా పడగొట్టిన మిచెల్ మార్ష్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆస్ట్రేలియా గడ్డపై గడిచిన 24 ఏళ్లలో టెస్ట్ల్లో పాకిస్తాన్కు ఇది వరుసగా 15వ ఓటమి కావడం విశేషం. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభమవుతుంది. -
ఐపీఎల్పై మనసు పారేసుకున్న పాకిస్తాన్ స్టార్ బౌలర్
ఐపీఎల్ 2024 సీజన్ వేలానికి ముందు పాకిస్తాన్ స్టార్ బౌలర్ హసన్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రతి క్రికెటర్ కోరుకునే విధంగానే తనకు కూడా ఐపీఎల్ ఆడాలని ఉందని అన్నాడు. ఐపీఎల్ ప్రపంచంలోనే అతి పెద్ద లీగ్లలో ఒకటని.. ఇలాంటి లీగ్లో ఆడాలని ప్రతి ఆటగాడు కలలు కంటాడని తెలిపాడు. భవిష్యత్తులో అవకాశం వస్తే తాను తప్పక క్యాష్ రిచ్ లీగ్లో పాల్గొంటానని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్కు ముందు ఓ లోకల్ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ హసన్ అలీ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పాకిస్తాన్ క్రికెటర్లు కేవలం ఒకే ఒక్క ఎడిషన్లో ఆడిన విషయం తెలిసిందే. లీగ్ ప్రారంభమైన తొలి ఏడాది (2008) మాత్రమే పాక్ క్రికెటర్లు ఐపీఎల్లో పాల్గొన్నారు. అనంతరం భారత్-పాక్ల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతినడంతో దాయాది దేశ క్రికెటర్లకు ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కలేదు. 2008 ఎడిషన్లో షాహిద్ అఫ్రిది (డెక్కన్ ఛార్జర్స్), షోయబ్ మాలిక్, మొహమ్మద్ ఆసిఫ్ (ఢిల్లీ డేర్ డెవిల్స్), కమ్రాన్ అక్మల్, సోహైల్ తన్వీర్ (రాజస్థాన్ రాయల్స్), మిస్బా ఉల్ హాక్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), షోయబ్ అక్తర్, సల్మాన్ బట్, ఉమర్ గుల్ (కోల్కతా నైట్రైడర్స్), అజహార్ మెహమూద్ (పంజాబ్ కింగ్స్) ఆయా ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించారు. -
శతాబ్దంలో ఒక్కటీ గెలవలేదు.. ఈ మ్యాచ్లోనైనా సౌతాఫ్రికా చరిత్ర తిరగరాస్తుందా..?
సౌతాఫ్రికా-పాకిస్తాన్ జట్ల మధ్య చెన్నై వేదికగా ఇవాళ (అక్టోబర్ 27) కీలక సమరం జరుగనుంది. ప్రస్తుత ఎడిషన్లో హ్రాటిక్ పరాజయాలు, చివరి మ్యాచ్లో పసికూన ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఘోర పరాభవం నేపథ్యంలో పాకిస్తాన్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. మరోవైపు సౌతాఫ్రికా ఈ టోర్నీలో భారీ విజయాలతో దూసుకుపోతూ, పాయింట్ల పట్టికలో భారత్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతుంది. నెదర్లాండ్స్ చేతిలో ఊహించని షాక్ మినహాయించి, ప్రస్తుత ఎడిషన్లో సౌతాఫ్రికా పరిస్థితి పాక్తో పోలిస్తే కాస్త మెరుగ్గానే ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో నాలుగింట భారీ విజయాలు సాధించి, భారత్ కంటే మెరుగైన రన్రేట్ కలిగి ఉంది. పాక్దే పైచేయి.. వన్డే ప్రపంచకప్లో పాక్-సౌతాఫ్రికాల మధ్య ఇప్పటివరకు మొత్తం 5 మ్యాచ్లు జరగ్గా.. సౌతాఫ్రికా మూడు, పాక్ రెండు మ్యాచ్ల్లో గెలుపొందాయి. ఈ శతాబ్దంలో ఒక్కటీ గెలవలేదు.. పాక్-సౌతాఫ్రికాల మధ్య వన్డే, టీ20 వరల్డ్కప్ల మ్యాచ్ల విషయానికొస్తే.. ఈ శతాబ్దంలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ల్లో సౌతాఫ్రికా ఒక్కటంటే ఒక్క మ్యాచ్లోనూ విజయం సాధించలేకపోయింది. 2009 టీ20 వరల్డ్కప్లో మొదలైన పాక్ జైత్రయాత్ర 2022 టీ20 వరల్డ్కప్ వరకు కొనసాగింది. పాక్.. 2009, 2010, 2012, 2022 టీ20 వరల్డ్కప్ల్లో.. 2015, 2019 వన్డే వరల్డ్కప్ల్లో సౌతాఫ్రికాను మట్టికరిపించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత వరల్డ్కప్లో ఇవాళ జరుగబోయే మ్యాచ్లోనైనా సౌతాఫ్రికా.. పాక్ను ఓడిస్తుందో లేదో వేచి చూడాలి. -
ప్రపంచకప్లో నేడు కీలక సమరం.. ఆసీస్తో పాక్ 'ఢీ'
వన్డే ప్రపంచకప్ 2023లో ఇవాళ (అక్టోబర్ 20) అత్యంత కీలక సమరం జరుగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతుంది. గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు ఈ మ్యాచ్ బరిలోకి దిగనున్నాయి. ఇరు జట్లకు ఈ మ్యాచ్లో గెలుపు కీలకం కావడంతో ఈ మ్యాచ్కు ప్రాధాన్యత సంతరించకుంది. పాక్తో పోలిస్తే ఆసీస్కే అత్యంత కీలకం ప్రస్తుత వరల్డ్కప్లో ఇరు జట్లు ఇప్పటివరకు చెరి 3 మ్యాచ్లు ఆడగా.. పాక్ రెండింటిలో, ఆస్ట్రేలియా ఓ మ్యాచ్లో గెలుపొందాయి. ఆడిన 3 మ్యాచ్ల్లో రెండింట ఓడిన ఆసీస్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. పాక్తో పోలిస్తే ఆసీస్కు ఈ మ్యాచ్లో విజయం చాలా అవసరం. సెమీస్ రేసులో నిలవాలంటే ఆసీస్ ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాలి. సెమీస్ రేసులో న్యూజిలాండ్, భారత్ ముందంజ.. సెమీస్ రేసులో న్యూజిలాండ్, భారత్లు ముందంజలో ఉండగా.. సౌతాఫ్రికా, పాకిస్తాన్లు ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆసీస్ టాప్-4లోకి చేరి సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్లో తప్పనిసరిగా పాక్ను ఓడించాలి. ఆరో స్థానంలో ఆసీస్.. నాలుగో ప్లేస్లో పాక్ భారత్, దక్షిణాఫ్రికా చేతుల్లో ఓడి శ్రీలంకపై కంటితుడుపు విజయాన్ని సాధించిన ఆసీస్.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ తర్వాత ఆరో స్థానంలో ఉండగా.. నెదర్లాండ్స్, శ్రీలంకలను ఓడించి, భారత్ చేతిలో ఓడిన పాక్ నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్లో గెలుపోటములు పాయింట్ల పట్టికలో స్థానాలను తారుమారు చేయడంతో పాటు సెమీస్ బెర్తులపై ఓ అవగాహణ తీసుకువస్తాయి. పాక్కు ముందుంది ముసళ్ల పండగ.. ఇప్పటివరకు నెదర్లాండ్స్, శ్రీలంక లాంటి చిన్న జట్లను ఓడించిన పాక్.. తదుపరి మ్యాచ్ల్లో (ఆసీస్తో మ్యాచ్ కాక) సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ లాంటి పటిష్టమైన జట్లతో పాటు చిన్న జట్లైన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లను ఢీకొట్టాల్సి ఉంది. ఆసీస్ విషయానికొస్తే.. భారత్, సౌతాఫ్రికా లాంటి పటిష్టమైన జట్ల చేతుల్లో ఓడి, శ్రీలంకపై విజయం సాధించిన ఆసీస్.. తదుపరి మ్యాచ్ల్లో (పాక్తో మ్యాచ్ కాకుండా) చిన్న జట్లైన నెదర్లాండ్స్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్తో పాటు న్యూజిలాండ్, ఇంగ్లండ్ లాంటి పటిష్టమైన జట్లతో తలపడాల్సి ఉంది. ఎవరిది పై చేయి..? వన్డే ప్రపంచకప్లో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు మొత్తం 10 మ్యాచ్లు జరగ్గా ఆరింట ఆస్ట్రేలియా, నాలుగు మ్యాచ్ల్లో పాకిస్తాన్ గెలుపొందాయి. ఇరు జట్ల మధ్య చివరి వరల్డ్కప్లో (2019) జరిగిన మ్యాచ్లో ఆసీస్ విజయం సాధించింది. తుది జట్లు (అంచనా).. ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్కీపర్), గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హాజిల్వుడ్ పాకిస్తాన్: అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్ -
పాకిస్తాన్లో రెచ్చిపోతున్న ఉగ్రమూకలు
పాకిస్తాన్లో రెచ్చిపోతున్న ఉగ్రమూకలు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement