IND VS WI 2nd T20: టీమిండియా ఆధిపత్యం కొనసాగేనా.. ? రెండో టీ20లో విండీస్‌తో ఢీకి రెడీ అయిన రోహిత్‌ సేన

1 Aug, 2022 07:44 IST|Sakshi

తొలి టీ20లో విండీస్‌పై 68 పరుగుల భారీ తేడా గెలుపొంది జోరుమీదున్న టీమిండియా.. నేడు జరిగే  రెండో టీ20లోనూ గెలిచి మరో క్లీన్‌స్వీప్‌కు బాటలు వేయాలని పట్టుదలతో ఉంది. గెలిచిన జట్టును మార్చేందుకు సుముఖంగా లేని భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తొలి మ్యాచ్‌ ఆడిన జట్టునే కొనసాగించనుంది. మరోవైపు వన్డే సిరీస్‌ను కోల్పోయిన కరీబియన్‌ జట్టు టీ20ల్లోనైనా సత్తా చాటుకోవాలని భావిస్తోంది. సెయింట్‌ కిట్స్‌ వేదికగా భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌ డీడీ స్పోర్ట్స్‌ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. 

తుది జట్ల అంచనా..
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌, హార్ధిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, దినేశ్‌ కార్తీక్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, అర్షదీప్‌ సింగ్‌, రవి బిష్ణోయ్‌

వెస్టిండీస్‌: కైల్‌ మేయర్స్‌, షమ్రా బ్రూక్స్‌, జేసన్‌ హోల్డర్‌, నిక్‌ పూరన్‌, రోవ్‌మన్‌ పావెల్‌, షిమ్రోన్‌ హెట్‌మైర్‌, అకీల్‌ హోసీన్‌, ఓడియన్‌ స్మిత్‌, కీమో పాల్‌, అల్జరీ జోసెఫ్‌, ఓబెద్‌ మెక్‌కాయ్‌
 

మరిన్ని వార్తలు