భానుపురి : నమ్మి అధికారాన్ని అప్పగిస్తే కేసీఅర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జ్ ధర్మార్జున్ విమర్శించారు. హైదరాబాద్లో మార్చి 10న జరిగే తెలంగాణ బచావో సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం సూర్యాపేట పట్టణంలో జన సమితి కార్యకర్తలు నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మాండ్రా మల్లయ్య, యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారబోయిన కిరణ్ కుమార్, చంద్రకాంత, కంబాలపల్లి శ్రీనివాస్, వీరే, వినయ్గౌడ్, దేవత సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణను కాపాడుకుందాం
ఆత్మకూర్ (ఎస్) : మిలియన్ మార్చ్ స్ఫూర్తితో కేసీఆర్ ద్రోహపూరిత, అవినీతి నియంతృత్వ పాలనపై మరోపోరాటం చేసి తెలంగాణను కాపాడుకుందాం అని తెలంగాణ జనసమితి యూత్ మండలం అధ్యక్షుడు యాకూబ్ రెడ్డి పిలుపునిచ్చారు. మార్చి 10న హైదరాబాద్లో తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ బచావో సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం ఆత్మకూరు మండల కేంద్రంలో పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్గౌడ్, వెంకన్న, బంటు అజయ్, మధు, జానీ, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
భానుపురి : ర్యాలీలో పాల్గొన్న నాయకులు
ఆత్మకూరులో పోస్టర్ ఆవిష్కరిస్తున్న నాయకులు