టెన్త్‌ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం

8 Apr, 2022 16:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి పరీక్షా సమయం 30 నిమిషాలు పొడిగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది మాదిరిగానే పరీక్షా సమయం పొడిగించారు. 2 గంటల 45 నిమిషాలు ఉన్న పరీక్ష సమయాన్ని 3 గంటల 15 నిమిషాలకు పొడిగించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 5 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. 70 శాతం సిలబస్‌నే అమలు చేస్తున్నామన్నారు. ప్రశ్నపత్రంలో అధిక చాయిస్‌ ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు.
చదవండి: గ్రూప్‌–1, 2 ఇంటర్వ్యూలకు గుడ్‌బై?

మరిన్ని వార్తలు