Photo Story: జాలువారుతున్న కారుమబ్బులు

19 Jun, 2021 16:01 IST|Sakshi

సాయం సంధ్యావేళ.. నింగిలో కారుమబ్బులు కమ్ముకోగా.. ఆకాశం నుంచి ఆ మబ్బులు ఇలా భూమిపైకి జాలువారుతున్నట్లు కనిపించాయి. కుమురం భీం జిల్లా కౌటాల సమీపంలో ఈ మనోహర దృశ్యం ఆవిష్కృతమైంది. శుక్రవారం ఈ చిత్రాన్ని ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. 
 – చింతలమానెపల్లి


భానుడి కిరణాలు..  బంగారు వర్ణాలు..  

కారుమబ్బులను చీల్చుకుంటూ నీటిపై పడిన భానుడి కిరణాలు బంగారు వర్ణాన్ని సంతరించుకున్నాయి. కుమురం భీం జిల్లా చింతలమానెపల్లి మండలం బాబాసాగర్‌ అర్కగూడ ప్రాజెక్టు వద్ద ఈ దృశ్యం కనువిందు చేసింది. శుక్రవారం సాయంత్రం సూర్యకిరణాలతో ప్రాజెక్టు నీరు మొత్తం పసిడి వర్ణం పులుముకోగా చేపల కోసం వేటగాళ్లు పడవల్లో తిరుగుతుండడం.. చిత్రకారుడు గీసిన బొమ్మలా ఆకట్టుకుంది.  
– చింతలమానెపల్లి

ఇవి కూడా చూడండి: 
సోనూ సూద్‌ ఇంటికి జనం తాకిడి

పాపం ఏనుగు.. వర్షంలో పాట్లు

>
మరిన్ని వార్తలు