సెకండ్ వేవ్లో మరింత పెరిగిన వ్యర్థాలు
దేశవ్యాప్తంగా ఏడాది కాలంలో 45,308 టన్నుల కోవిడ్ బీఎండబ్ల్యూ ఉత్పత్తి
వీటి సురక్షిత నిర్వహణ ప్రశ్నార్థకమే అంటున్న నిపుణులు
6.3టన్నులు మేలో రాష్ట్రంలో సగటున రోజుకు ఉత్పత్తి అయిన బయో మెడికల్ వ్యర్థాలు
382టన్నులు గత మూడు నెలల్లో ఉత్పత్తి అయిన బయో వ్యర్థాలు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ సెకండ్ వేవ్ భారత్ను ఆరోగ్య, ఆర్థిక, పర్యావరణ అంశాల్లో తీవ్ర ప్రభావానికి గురిచేసింది. దేశవ్యాప్తంగా పెద్దసంఖ్యలో కరోనా కేసులు వెల్లువెత్తడంతో వివిధ రూపాల్లో జాగ్రత్తల కోసం ఉపయోగించి పారేసిన బయో మెడికల్ వ్యర్థాలు (బీఎండబ్ల్యూ) పర్యావరణం, ఆరోగ్య సంబంధిత అంశాలపై ఏ మేరకు ప్రభావితం చేస్తాయోనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా కేసుల పెరుగుదలతో కరోనా పేషెంట్లతో ఆసుపత్రులన్నీ నిండిపోవడంతో, మునుపెన్నడూ లేనివిధంగా పీపీఈ కిట్లు, మాస్క్లు, ఫేస్షీల్డ్లు, గ్లౌజులు, సిరంజీలు, హెడ్, షూ కవర్లు తదితర వస్తువుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.
2 నెలల్లో 50 శాతం వృద్ధి.. : ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లోనే మన దేశంలో బీఎండబ్ల్యూ దాదాపు 50% అధికంగా ఉత్పత్తి అయినట్లు ‘సెంటర్ ఫర్ సైన్స్ ఎన్విరాన్మెంట్–స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ ఇన్ ఫిగర్స్–2021’ నివేదికలో వెల్లడైంది. ఏప్రిల్లో రోజుకు 139 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి కాగా, మేలో 203 టన్నులకు పెరిగింది. గత నెల 10న అత్యధిక స్థాయిలో రోజుకు 250 టన్నుల వ్యర్థాల ఉత్పత్తి అయింది. వ్యర్థాల నిర్వహణ, చికిత్స, నాశనం చేయడానికి సంబంధించి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ వ్యర్థాలను శుద్ధి చేసి పర్యావరణానికి హాని కలగకుండా బయటికి వదిలేందుకు దేశవ్యాప్తంగా 198 కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ అండ్ డిస్పోజల్ ఫెసిలిటీస్ (సీబీడబ్ల్యూటీఎఫ్) ఉన్నాయి.
రాష్ట్రంలో రోజుకు సగటున 6.3 టన్నులు..
సెకండ్ వేవ్లో తెలంగాణలో..
దేశవ్యాప్తంగా చూస్తే..
ప్రధానంగా ఆసుపత్రుల నుంచి సేకరించిన బీఎండబ్ల్యూనే ట్రీట్ చేస్తున్నారు. కోవిడ్కు అనేక మంది ఇళ్లలోనే ఉంటూ చికిత్స తీసుకున్నారు. మాస్క్లు, గ్లౌజులు, ఫేస్షీల్డ్లు వంటి వాటి వ్యక్తిగత వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. వీటిని ఉపయోగించాక ఏ మేరకు సురక్షితంగా వాటిని పారవేశారనేది ప్రశ్నార్థకమే. ముఖ్యంగా గ్రామాల్లో బీఎండబ్ల్యూ నిర్వహణ ఏ విధంగా ఉంది అన్నదానిపై పూర్తిస్థాయిలో గణాంకాలు, సమాచారం అందుబాటులో లేదు. రోడ్లపై అక్కడక్కడ మాస్క్లు, ఇతర వ్యర్థాలు నిర్లక్ష్యంగా పారేసిన దృశ్యాలు మనకు తరచుగా కనిపిస్తున్న విషయం బహిరంగ రహస్యమే. ఈ వ్యర్థాలు బాధ్యతారహితంగా పడవేయకుండా, పర్యావరణానికి నష్టం కలగని విధంగా క్రమపద్ధతిలో వాటిని శుద్ధిచేసే కార్యాచరణలో అన్నిస్థాయిల్లో ప్రజలను భాగస్వాములను చేయాలి.
– ప్రీతి బంతియా మహేశ్, చీఫ్ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్, టాక్సిన్ లింక్ ఎన్విరాన్మెంట్ గ్రూప్