రాజ్‌భవన్‌లో దీపావళి సంబురాలు రేపు

23 Oct, 2022 10:29 IST|Sakshi

గవర్నర్‌ తమిళిసై ఓపెన్‌ హౌస్‌

సాక్షి, హైదరాబాద్‌: దీపావళి పర్వదినం సందర్భంగా ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాజ్‌భవన్‌ దర్బార్‌ హాల్‌లో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాన్ని నిర్వహించను­న్నారు. ఈ సందర్భంగా ఆమె సామాన్య ప్రజా­నీకంతో పాటు వివిధ రంగాల ప్రముఖులను కలుసుకుని దీపావళి పండుగను జరుపుకోనున్నారు.

ఇదీ చదవండి: మునుగోడులో పోస్టర్‌ వార్‌

మరిన్ని వార్తలు