-
రాజ్భవన్లో దీపావళి సంబురాలు రేపు
సాక్షి, హైదరాబాద్: దీపావళి పర్వదినం సందర్భంగా ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్భవన్ దర్బార్ హాల్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆమె సామాన్య ప్రజానీకంతో పాటు వివిధ రంగాల ప్రముఖులను కలుసుకుని దీపావళి పండుగను జరుపుకోనున్నారు. ఇదీ చదవండి: మునుగోడులో పోస్టర్ వార్ -
రాజ్భవన్ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్, న్యూస్లైన్: గవర్నర్ నివాసం రాజ్భవన్ ముందు శుక్రవారం మధ్యాహ్నం ఓ యువకుని ఆత్మహత్యాయత్న ఘటన కలకలం రేపింది. వైఎస్సార్ జిల్లాకు చెందిన పవన్ కుమార్ పురుగుల మందు తాగి వచ్చి నోటి నుంచి నురగలు కక్కుకుంటూ రాజ్భవన్ వద్ద కింద పడిపోయాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు, మీడియా సిబ్బంది ఇది గమనించి పవన్కుమార్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు సూసైడ్ నోట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. వైఎస్సార్ కడప జిల్లా వీరపునాయినిపల్లె మండలం కొమ్మర్ది గ్రామానికి చెందిన దొంతు పవన్కుమార్ ఎల్ఐసీ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. ఇటీవల పక్క గ్రామమైన రుషిరెడ్డిపల్లెకు చెందిన లింగిరెడ్డి రామ్మోహన్రెడ్డి, గజ్జల సురేష్రెడ్డి, రామచంద్రారెడ్డి, వై.గంగిరెడ్డిలు పవన్కుమార్ ఇంటి తలుపులు బద్దలు గొట్టి లోపల ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు రూ. 34 వేల నగదు, టీవీ, డీవీడీ ప్లేయర్ తదితర సామగ్రిని దోచుకెళ్లారు. ఇదే విషయమై స్థానిక యర్రగుంట్ల ఇన్స్పెక్టర్ రామకృష్ణుడుకు ఫిర్యాదు చేసినా తిరిగి తననే చిత్రహింసలకు గురి చేస్తున్నారని, చంపుతామని బెదిరిస్తున్నారని పవన్కుమార్ తెలిపారు. తనకు జరిగిన అన్యాయంపై వీడియో టేపులతో సహా అన్ని ఆధారాలను ఇన్స్పెక్టర్కు ఇచ్చినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా తనని చితకబాదారని వాపోయాడు. తనకు జరిగిన అన్యాయాన్ని గవర్నర్కు విన్నవించేందుకు వస్తే పోలీసులు అనుమతించడం లేదని, అందుకే తాను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నాడు. గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని పంజగుట్ట పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
Advertisement