హైదరాబాద్‌: ‘మిస్సింగ్‌ బాలమ్మ’ దారుణ హత్య.. శవం దొరక్కుండా ఏం చేశారంటే..

27 Dec, 2022 16:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బాలాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ మిస్సింగ్‌ కేసులో బాధితురాలిని దారుణంగా హతమార్చినట్లు తేలింది. శవం దొరక్కుండా ఉండేందుకు.. విడి భాగాలను కాల్చేసి ఆ బూడిదను డ్రైనేజీలో కలిపారు నిందితులు. 

ఈ మేరకు నిందితులను రాములు, లలితగా గుర్తించారు. బొర్ర బాలమ్మ అనే మహిళ గత నెల 27వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. దీంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అయితే.. ఈ క్రమంలో ఆమె హత్యకు గురైనట్లు సోమవారం ధృవీకరించారు పోలీసులు.

బాధితురాలిని హత్య చేసి ఆమె నుంచి నగలను దోచుకున్నారు నిందితులిద్దరూ. ఆపై మృతదేహాన్ని ముక్కలు చేసి.. కాల్చేసి ఆ బూడిదను మురికి కాలువలో కలిపేశారు. దర్యాప్తు ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి ఆరు తులాల బంగారం, 159 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు