జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. రాష్ట్ర సరిహద్దు నుంచి విదర్భ మీదుగా దక్షిణ, మధ్య మహారాష్ట్ర వరకు, జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.
ఇది సముద్రమట్టం నుంచి సగటున 3.1 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో పలుచోట్ల జల్లులు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. రాష్ట్రానికి తూర్పు, ఉత్తర జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీ వర్షాలు నమోదవుతాయని సూచించింది.