హైదరాబాద్‌ బీజేపీలో జోష్‌.. సీనియర్ల వలసలతో ఉత్సాహం

21 Nov, 2022 08:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందుగానే గ్రేటర్‌ పరిధిలో కమలం పార్టీలో జోష్‌ నెలకొంది. ఇతర పార్టీల నుంచి సీనియర్ల చేరికలతో శ్రేణుల్లో కొత్త ఉత్సాహం పెరుగుతోంది. తాజాగా సనత్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. గతంలో మహానగరం పరిధిలో కమలం పార్టీ, అనుబంధ సంఘాలకు గట్టి పట్టు ఉండటంతో బల్దియా ఎన్నికల్లో సత్తా చాటిన విషయం విదితమే.

అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో కొందరు కార్పొరేటర్లు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నప్పటికీ.. ఇతర పారీ్టల నుంచి బీజేపీలోకి చేరికలు ఆగడం లేదు. పాత నగరం మినహా ప్రధాన నగరం, శివార్లలో ప్రతి నియోజకవర్గం నుంచి ఇద్దరు నుంచి ముగ్గురు సీనియర్‌ నేతలు కమలం పార్టీ టికెట్‌ ఆశిస్తున్నట్లు ఆయా వర్గాలు చెబుతున్నాయి.  
చదవండి: తెలంగాణను వణికిస్తున్న చలి.. అతితక్కువ కనిష్ట ఉష్ణోగ్రత 7.6 డిగ్రీలు

ప్రత్యేక దృష్టితో ముందుకు.. 
పార్టీ పరంగానూ గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు పొరుగునే ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని పలు నియోజకవర్గాలపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పేర్కొంటున్నాయి. ఇటీవల పలువురు కేంద్ర మంత్రులు హైదరాబాద్, సికింద్రాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. పలు సభలు, సమావేశాలు, పార్టీ ఆఫీస్‌ బేరర్లు, ముఖ్య నేతలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు.

బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య మాటల యుద్ధం, పొలిటికల్‌ వార్‌ తీవ్రంగా నడుస్తున్న ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్రభుత్వం వివిధ పద్ధుల కింద రాష్ట్రానికి కేటాయించిన నిధులపై ప్రచారం చేయాలని కేంద్ర మంత్రులు సూచిస్తున్నారు. వచ్చే ఏడాది నవంబరులో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయన్న సంకేతాల నేపథ్యంలో ఏడాది ముందుగానే నగరంలో రాజకీయ వేడి పెరిగిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

కాంగ్రెస్‌ నుంచి భారీగా వలసలు? 
టీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో వలసలు నామమాత్రంగా కొనసాగుతున్నప్పటికీ.. కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి భారీగా వలసలు కొనసాగనున్నట్లు కమలం పార్టీ నేతలు చెబుతున్నారు. హస్తం పారీ్టలో వర్గ రాజకీయాలు తీవ్రం కావడంతో తమ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు పలువురు సీనియర్‌ నేతలు క్యూ కడుతున్నట్లు విశ్లేíÙస్తుండడం గమనార్హం. మరో ఆరునెలల్లో వలసలు మరింత అధికమవుతాయని అంచనా వేస్తుండడం గమనార్హం.   

మరిన్ని వార్తలు