ఆదిలాబాద్‌ ఎంపీకి అరుదైన అవకాశం

23 Jun, 2022 02:05 IST|Sakshi

రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము నామినేషన్‌ కోసం ఆహ్వానం  

ఆదిలాబాద్‌ టౌన్‌: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఈనెల 24న న్యూఢిల్లీలో నామినేషన్‌ దాఖలు చేయనుండగా.. ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరుకావాలని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి ఆహ్వానం అందింది.

ఈ మేరకు బుధవారం సాయంత్రం పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి అర్జున్‌రామ్‌ మేఘవాల్‌ స్వయంగా బాపూరావుకు ఫోన్‌చేసి వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించారు.  ఆదివాసి బిడ్డ ద్రౌపది ముర్ము నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో ఆ పత్రాలపై అదే వర్గానికి చెందిన బాపూరావుకు ప్రతిపాదించేందుకు అరుదైన అవకాశం లభించడం విశేషం. 

మరిన్ని వార్తలు