Raghu Rama Krishna Raju: హైకోర్టులో రాఘురామకృష్ణరాజుకు చుక్కెదురు

8 Jul, 2022 16:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎంపీ రాఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. గచ్చిబౌలి పీఎస్‌లో దాఖలైన కేసు కొట్టేయాలని క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. కోర్టు పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. 

వివరాల ప్రకారం.. రఘురామకృష్ణరాజు ఇంటి వద్ద విధి నిర్వహణలో ఉన్న ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ను ఇంట్లో నిర్బంధించి దాడి చేశారన్న విషయంలో గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలో కేసు కొట్టివేయాలని క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా, పిటిషన్‌పై విచారణలో భాగంగా.. కోర్టులో పోలీసులు కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఈ సందర్భంగా పోలీసులు.. ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ను ఇంట్లో నిర్బంధించి దాడి చేశారని కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టుకు చెప్పారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని పోలీసులు స్పష‍్టం చేశారు. సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది సస్పెండ్‌ అయ్యారని తెలిపారు. దీంతో, పోలీసుల వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. 

ఇది కూడా చదవండిగుట్కా దందా.. తమ్ముళ్ల పంథా

మరిన్ని వార్తలు