సికింద్రాబాద్‌-తిరుపతి ‘వందే భారత్‌’ రైలు ప్రత్యేకతలు, టికెట్‌ ధరలివే!

7 Apr, 2023 20:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్‌ స్టేషన్‌లో శనివారం ఉదయం సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సికింద్రాబాద్‌- విశాఖపట్నం మధ్య తొలి వందే భారత్‌ రైలు నడుస్తుండగా.. ఇది రెండోది కానుంది. ఈ సెమీ హైస్పీడ్‌  రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు  స్టేషన్లలో ఆగనుంది. మంగళవారం మినహా మిగిలిన రోజుల్లో ఈ రైలు సేవలందిస్తుంది.

సికింద్రాబాద్‌ - తిరుపతి మధ్య నడిచే (20701) రైలు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఉదయం 6గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2.30గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అలాగే, తిరుపతి - సికింద్రాబాద్‌ (20702) రైలు తిరుపతి రైల్వేస్టేషన్‌ నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరి రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోనుంది. తాజాగా ఈ మార్గంలో టికెట్ల ధరల వివరాలను ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. సికింద్రాబాద్ - తిరుపతి, తిరుపతి - సికింద్రాబాద్ రూట్లలో టికెట్ల రేట్లలో స్వల్ప వ్యత్యాసం ఉంది.

సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ ట్రైన్ ప్రత్యేకతలు

► నిత్యం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఆరు సూపర్ ఫాస్ట్ ట్రైన్స్
►సికింద్రాబాద్ నుంచి తిరుపతికి సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ లో 12 గంటల ప్రయాణం
►వందే భారత్ ట్రైన్‌ సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 8.30 గంటల ప్రయాణం
►దేశంలో ఇది 13వ వందే భారత్ ట్రైన్.. ఇందులో 8 కోచ్ లు 530 సీటింగ్ కెపాసిటీ.
►1 ఎగ్జిక్యూటివ్, 7 చైర్ కార్ కోచ్‌లు
►ప్రయాణికుల ఆదరణ దృష్ట్యా కోచ్‌లను పెంచే అవకాశం
►శనివారం ఉదయం 11.30 నుంచి 12.05 లోపు సికింద్రాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్ ప్రారంభం
►ఈనెల 9 నుంచి ఉదయం 6 గంటలకు ప్రయాణికులకు అందుబాటులో వందే భారత్ ట్రైన్
►ఈ వందే భారత్ ట్రైన్ స్పీడ్ గంటకు 77 కిలోమీటర్లు
►సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చైర్ కార్ చార్జీ 1680, ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జీ 3080 రూపాయలు
►తిరుపతి నుంచి సికింద్రాబాద్ చైర్ కార్ ఛార్జీ 1625, ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జీ 3030 రూపాయలు
►వారానికి 6 రోజులు మాత్రమే సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందే భారత్ ట్రైన్ రాకపోక

సికింద్రాబాద్‌ నుంచి ఒక్కో స్టేషన్‌కు ఛార్జీలు ఇలా..

ఛైర్‌ కార్‌
►సికింద్రాబాద్ నుంచి నల్గొండ - రూ.470
►సికింద్రాబాద్ నుంచి గుంటూరు - రూ.865
►సికింద్రాబాద్ నుంచి ఒంగోలు - రూ.1075
►సికింద్రాబాద్ నుంచి నెల్లూరు - రూ.1270
►సికింద్రాబాద్ నుంచి తిరుపతి - రూ.1680

ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌
►సికింద్రాబాద్ నుంచి నల్గొండ - రూ.900
►సికింద్రాబాద్ నుంచి గుంటూరు - రూ.1620
►సికింద్రాబాద్ నుంచి ఒంగోలు - రూ.2045
►సికింద్రాబాద్ నుంచి నెల్లూరు - రూ.2455,
►సికింద్రాబాద్ నుంచి తిరుపతి - రూ.3080
చదవండి: ప్రధాని పర్యటనకు కేసీఆర్‌ వస్తే సన్మానం చేస్తాం: బండి సంజయ్‌

మరిన్ని వార్తలు