చిట్టి బుర్రలు..గట్టి ఆలోచనలు

24 Sep, 2023 03:01 IST|Sakshi

సాంకేతిక పరిజ్ఞానంతో రోబోల తయారీ

అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన విద్యార్థుల ప్రతిభ

రాజవొమ్మంగి (అల్లూరి సీతారామరాజు): చిట్టి బుర్రల్లో ఆధునిక ఆలోచనలు మొల­కెత్తాయి. స్పీడ్‌గా వెళ్తున్న ట్రైన్‌కు ట్రాక్‌పై ఏదై­నా అడ్డంకి ఏర్పడితే ప్రమాదాన్ని ముందుగా­నే గుర్తించి సడన్‌గా ఆగిపోయే ఇంటెలిజెంట్‌ ట్రైన్‌ ఇంజిన్‌.. చిన్న బటన్‌ సహాయంతో నడి­చేలా దివ్యాంగుల కోసం రూపొందించిన స్మార్ట్‌ వీల్‌ చైర్‌.. మనిషికి అవసరమైన వివిధ పనులు చేసి పెట్టే ఎనిమిది రకాల రోబోలు ఆవిష్కృతమయ్యాయి.

అల్లూరి సీతారామ­రాజు జిల్లా రాజవొమ్మంగిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రతిభకు అద్దంపడుతున్నాయి. పలువురి అభినం­దనలు అందుకున్నాయి. కాగా, ఇటీ­వల ఈ పాఠశాలలో ఏర్పాటు చేసిన అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లో నిర్వహించిన రోబోటిక్‌ వర్క్‌షాప్‌లో మూడు రోజుల పాటు 7, 8, 9, పది తరగతుల విద్యార్థులు శిక్షణ పొందారు. అనంతరం వారు రూపొందించిన వివిధ రకా­ల రోబోలను శనివారం ప్రదర్శించారు. వీటిలో స్మార్ట్‌ వీల్‌ చైర్, స్మార్ట్‌ షాపింగ్‌ ట్రాలీ, కెమెరాతో పనిచేసే స్పై రోబో, సెర్వింగ్‌ (ఆహార పదార్థాలు వడ్డించే) రోబో, అగ్రికల్చ­ర్‌కు సంబంధించి హార్వెస్టింగ్‌ రోబో, ఇంటిలిజెంట్‌ ట్రైన్‌ ఇంజన్‌ తదితర ఎనిమిది రకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. 

మరిన్ని వార్తలు