'పార్టీ కార్యకర్తలు తాలిబన్లు, నక్సలైట్లుగా ఉద్యమించాలి'

26 Sep, 2021 19:27 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: వైరా ఎమ్మెల్యే మరోసారి నోరుజారారు. కొనిజర్ల మండలం అమ్మపాలెం గ్రామంలోని శ్రీసిటీలో ఆదివారం ఎమ్మెల్యే రాములు నాయక్‌ అధ్యక్షతన వైరా నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆవేశంగా మాట్లాడిన ఆయన పార్టీ కార్యకర్తలు తాలిబన్లు, నక్సలైట్లుగా ఉద్యమించాలని బహిరంగంగా పిలుపునిచ్చారు. దీంతో ఆయన మాట్లాడిన మాటలు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల జరుగుతున్న వరుస మీటింగ్‌లలో ఎమ్మెల్యే అదుపుతప్పి మాట్లాడుతూ వివాదాస్పదంగా నిలుస్తున్నారు.  చదవండి: (పెళ్లయిన నెలకే.. భార్య గొంతు కోసి దారుణహత్య)

మరిన్ని వార్తలు