పద్మశ్రీ వనజీవి రామయ్యకు అస్వస్థత

13 Feb, 2021 14:06 IST|Sakshi

సాక్షి, ఖమ్మం : వృక్ష ప్రేమికులు, పద్మశ్రీ వనజీవి రామయ్య అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయన్ని శనివారం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. వనజీవి రామయ్యకు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను వైద్యులను ఆదేశించారు. ఖమ్మం గ్రామీణ మండలం రెడ్డిపల్లికి చెందిన రామయ్య.. వనజీవిగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.


 

మరిన్ని వార్తలు