పరిగి: ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్కు బిగ్షాక్ తగిలింది. కుల్కచర్ల ఎంపీపీ సత్యహరిశ్చందర్ శుక్రవారం పార్టీకి రాజీనామా చేసి డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా కాంగ్రెస్లో చేరుతున్నారన్నారు. భవిష్యత్లోనూ వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. బీఆర్ఎస్ నాయకులు సొంత పార్టీ నాయకులనే ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. గిరిజన ప్రజాప్రతినిధులు చులకనగా చూడడం వారికి పరిపాటి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అగ్రవర్ణాలకు పెద్దపీట వేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు భూములు పంచితే వారి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుంటోదన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే మహేశ్రెడ్డి గిరిజనులపై అక్రమ కేసులు బనాయిస్తూ.. ఇబ్బంది పెడుతున్నారన్నారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ.. తాను గిరిజన మహిళ అయినందునే ప్రజలకు సేవ చేయకుండా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని పార్టీలో చేరానన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు లాల్కృష్ణ, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చంద్రయ్య, నాయకులు రవినాయర్, మండల అధ్యక్షుడు పరశురాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘కారు’ దిగి కాంగ్రెస్లోకి కుల్కచర్ల ఎంపీపీ