చేవెళ్ల ఎమ్మెల్యేకు నిరసన సెగ

18 Nov, 2023 07:48 IST|Sakshi

షాబాద్‌: ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ అభ్యర్థులకు పలుచోట్ల నిరసన సెగలు తగులుతున్నాయి. శుక్రవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మండల పరిధిలోని అంతారం, కేసారం, బోడంపహాడ్‌ గ్రామంలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా పలు గ్రామా ల్లో దళిత బంధు, ఇల్లు, పింఛన్‌లు తదితర విషయా లపై ప్రజలు ఆయన్ను నిలదీశారు. బోడంపహాడ్‌లో గ్రామంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్‌ నాయకులను పోలీస్‌ వాహనంలో స్టేషన్‌కు తరలించడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం ఎమ్మెల్యే ప్రచారం కొన సాగింది.

ఇరు పార్టీల నాయకుల మధ్య ఘర్షణ

కాంగ్రెస్‌ నాయకులను స్టేషన్‌కు తరలించిన పోలీసులు

మరిన్ని వార్తలు