కుల్కచర్ల: పరిగి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల మహేశ్రెడ్డి ప్రకటించారు. మండలంలోని మక్తవెంకటాపూర్, వీరాపూర్, మల్కాపూర్, బంగ్రంపల్లి, కిష్ఠంపల్లి, చాకల్పల్లి, కల్మన్కాల్వ, కొత్తపల్లి, పుర్సంపల్లి, మరికల్ గ్రామాల్లో శుక్రవారం ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి నిర్విరామంగా కృషి చేస్తానన్నారు. ఎన్నికల వేళ ప్రజలు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాలని, మోసపూరిత మాటలు నమ్మితే ఐదేళ్ల పాటు గోస పడాల్సి వస్తుందన్నారు. చౌడాపూర్ మండల కేంద్రానికి చెందిన పలువురు యువకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు రాందాస్ నాయక్, బీఆర్ఎస్ చౌడాపూర్ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ నాగరాజు, పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర కార్యదర్శి వెంకట్, యువజన విభాగం అధ్యక్షుడు మేగ్యనాయక్, నాయకులు నర్సింలు, చెన్నయ్య, అశోక్, మాసయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మహేశ్రెడ్డి