నిరంతరం తనిఖీలు

18 Nov, 2023 07:48 IST|Sakshi
పోలీసుల సమక్షంలో మాజీమంత్రి ప్రసాద్‌కుమార్‌ రోడ్‌షో

పెద్దేముల్‌: ఎన్నికల నేపథ్యంలో తాండూరు–హైదరాబాద్‌, తాండూరు–జహీరాబాద్‌ ప్రధాన రహదారులపై పోలీసులు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయడంతో పాటు నగదు, మద్యం రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఎస్‌ఐ అబ్దుల్‌ రవూఫ్‌ తెలిపారు. శుక్రవారం పెద్దేముల్‌– తాండూరు మండలాల మధ్య కందనెల్లి సమీపంలో జిల్లా ఏస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు సోదాలు చేశామని ఎస్‌ఐ వివరించారు.

ప్రచారానికి

పటిష్ట బందోబస్తు

వికారాబాద్‌ ఎమ్మెల్యే స్వగ్రామంలో పోలీసుల పహారా

ధారూరు: ఎన్నికల వేళ కవ్వింపు చర్యలకు పాల్పడకుండా ఆయా పార్టీల అభిమానులకు పోలీసులు కళ్లెం వేశారు. ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ స్వగ్రామమైన కేరెళ్లిలో శుక్రవారం కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారం చేపట్టింది. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కొంతమంది ఆకతాయిలు కొట్లాటకు పాల్పడనున్నట్లు ముందస్తు సమాచారంతో ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ స్పెషల్‌ ఫోర్స్‌తో పర్యవేక్షించారు. మాజీమంత్రి ప్రసాద్‌కుమార్‌ గ్రామానికి రావడంతో పెద్దఎత్తున పోలీసుల మోహరింపుతో ఆకతాయిలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు